జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ – వైయస్ షర్మిల

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై మరో సారి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి, కెటిఆర్ కోవర్ట్ అని ఆరోపించారు. జగ్గారెడ్డి కెటిఆర్ కోవర్ట్ అని ఆయన గాంధీ భవన్ మొత్తం తెలుసన్నారు. వైఎస్సార్ నిన్ను పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. వైఎస్సార్ పార్టీ మారాడా…ఎప్పుడు మారాడు పార్టీ? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ గెలిచిన పార్టీ.. కాంగ్రెస్ లో కలిసి పోయిందని.. ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్ కి పట్టలేదన్నారు. నీలా పార్టీలు మారి రాజకీయ వ్యపిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్ ది కాదన్నారు. పొద్దున టిఆర్ఎస్,మధ్యాహ్నం బీజేపీ,సాయంత్రం కాంగ్రెస్..ఎవడు పిలిస్తే అక్కడికి పోతావని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“వైఎస్సార్ నీ శీలం కరాబు చేశాడా. పార్టీలు మారినందుకు ఎన్ని సార్లు శీలం దోచుకున్నారు జగ్గారెడ్డి. ఎవరికి కథలు చెప్తున్నవు జగ్గారెడ్డి. ఒక్కరోజైనా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు అని ప్రశ్నించావా. ఈ సంగారెడ్డి ప్రజలకు కోసం ఒక్క రోజైనా కొట్లాడావా. నీతో లాభం లేని సంగారెడ్డి కి నువు ఎమ్మెల్యే గా ఉంటే ఎంత..లేకుంటే ఎంత. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నావు..రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే క్లారిటీ లేదు. నువ్వా మా గురించి మాట్లాడేది.” అని వైయస్ షర్మిల మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news