10 వేల మందితో ఇంటర్ బోర్డు ముట్టడిస్తా : కేసీఆర్ కు జ‌గ్గారెడ్డి వార్నింగ్‌

-

సీఎం కేసీఆర్ కు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 10 వేల మంది విద్యార్థుల‌తో ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. 2 లక్షల 36 వేల మంది ఇంట‌ర్ విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని.. లక్ష పైబడి విద్యార్దులు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులేన‌ని పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్దం కావడం లేదని.. ఆత్మహత్య లు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విద్యార్థులు ఆత్మహత్యలు వద్దని చెప్పే పరిస్థితి కూడా లేదని… మూడు గంటలు దీక్ష చేశాము.. కానీ ప్రభుత్వం నుండి స్పందన రాలేదని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ను అప్పాయింట్ మెంట్ కోరా… కానీ రిప్లై లేదని మండి ప‌డ్డారు. ఈ విష‌యంలో విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవ‌ద్ద‌ని.. ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన రాకుంటే.. ..మంగళవారం ఇంటర్ బోర్డు ముట్టడి కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news