దసరా రోజు సంచలన ప్రకటన చేస్తా – జగ్గారెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాల సంగతి తెలిసిందే. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే గత ఐదు రోజుల క్రితమే రేపు సంచలన ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఏం చెబుతారా అని అంతా ఉత్కంఠగా వింటుండగా.. ప్రస్తుతం తాను ఎవరి పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. మొన్నటి వ్యాఖ్యలపై నో కామెంట్స్ అని అన్నారు జగ్గారెడ్డి. సంచలన ప్రకటన ఏముంటుంది అనేది సమయమే డిసైడ్ చేస్తుందని చెప్పారు.

అయితే తాజాగా శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో జగ్గారెడ్ది కాంగ్రెస్ పార్టీని వీడడం కలలో కూడా జరగదు, జరగని పని అని తేల్చి చెప్పారు. దసరా రోజున సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.” నేను టిఆర్ఎస్ లో చేరతానని మీడియాలో వచ్చే అంచనాలు ఎప్పటికి నిజం కావు. నాలుగు నెలల పాటు హైదరాబాదులో ప్రెస్ మీట్ లు నిర్వహించను. నా నియోజకవర్గానికే పరిమితం అవుతాను.” అంటూ జగ్గారెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news