22 సార్లు జైలుకెళ్లినా.. పద్దతి మార్చుకోని బీటెక్ దొంగ..!

-

చదివింది బీటెక్.. కానీ మాయమాటలు చెప్పి మనుషులను నమ్మించి వంచించడంలో ఇతడు పీహెచ్‌డీ చేశాడు. ఇతగాడిపై 33 కేసులు నమోదైయ్యాయి. 22 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. ఇదీ ఇతని ట్రాక్ రీకార్డు. ఎన్ని సార్లు బుద్ది చెప్పిన మారటంలేదు. ఇంతకీ ఇతను చేసిన మోసాలు ఎంటో తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివేయండి మరి.

ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకొని తన అక్రమ దందాలకు పాల్పడ్డాడు. ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్ చేసి యువతకు తెలియజేయాలని కోరేవాడు. ఆ తర్వాత వారి దగ్గరి నుంచి డిపాజిట్ పేరుతో దోచుకొని ఉడాయించేవాడు. నరసాపురం పీఎస్ పరిధిలో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలంటూ నాయకుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి జైలు పాలయ్యాడు. ఇలా మొదట 2008లో తణుకులో ఒకరి దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి ఉద్యోగం కోల్పోయి జైలుకెళ్లాడు. ఇదే తరహాలో 2009లో విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

2013లో బీజేపీ నేత రాం జగదీశ్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై వచ్చాక ఎంపీలు వి. హనుమంతరావు, దేవేందర్ గౌడ్‌, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలను మోసం చేసి డబ్బులు కాజేశాడు. 2015లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేకు రూ. 90 వేలు టోకరా వేసి పోలీసులకు చిక్కాడు. ఇలా చాలా కేసుల్లో అరెస్ట్ అవడం బయటికి రావటం జరుగుతునే ఉంది. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షలు ఇప్పిస్తానని చెప్పి రూ.2.5 లక్షలను తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. ఈ కేసుపై అతడిని శ్రీకాళహస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఇతని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడుగా గుర్తించారు. జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశాడని ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడని పోలీసులు వివరాలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news