“జైలర్ – 2” సీక్వెల్ కోసం డైరెక్టర్ కు భారీగా అడ్వాన్స్ ?

-

రజినీకాంత్ మరియు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం జైలర్.. ఇందులో సినిమా మొత్తాన్ని రజినీకాంత్ తన భుజంపై వేసుకుని అద్భుతమైన నటనతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు. ఈ సినిమా దెబ్బకు ఎన్నో రికార్డులు రజినీకాంత్ కు దాసోహం అయ్యాయి. మాములుగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే వెంటనే ఈ సినిమా సీక్వెల్ వస్తుందా అంటూ థంబ్ నెయిల్స్ తో ఆర్టికల్స్ వస్తుంటాయి. కానీ జైలర్ సినిమాను మాత్రం సీక్వెల్ కూడా నిర్మిస్తున్నారని తమిళ సినిమా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమాకు గాను అప్పుడే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు భారీగా అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సీక్వెల్ ను వెంటనే మొదలు పెట్టాలని నిర్మాణ సంస్థ డైరెక్టర్ కు రూ. 55 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చిందట. విషయం అడ్వాన్స్ ఇవ్వడం వరకు వెళ్లిందంటే త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని అంతా భావిస్తున్నారు.

మరి ఇందులో తారాగణం ఎవ్వరు ? సినిమాలో రజినీకాంత్ ఏ విధంగా దర్శనం ఇవ్వనున్నారు లాంటి చాలా ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మనసులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news