Pro Kabaddi 2019: పాట్నాపై జైపూర్, బెంగాల్ పై బెంగళూరు గెలుపు

-

ఇవాళ్టి మ్యాచుల విషయానికి వస్తే… 25వ మ్యాచ్ హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ మధ్య పాట్నాలో ఇవాళ రాత్రి 7.30కు ప్రారంభం కానుంది. 26వ మ్యాచ్ రాత్రి 8.30 కు పాట్నా పైరేట్స్, పునేరి పల్తాన్ మధ్య అదే పాట్నా స్టేడియంలో పోరు జరగనుంది.

ప్రో కబడ్డీ 2019 ఏడో సీజన్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. నిన్నటితో మొత్తం 24 మ్యాచులు పూర్తయ్యాయి. 23వ మ్యాచ్ లో భాగంగా పాట్నాలోని పాట్లిపుత్ర ఇండోర్ స్టేడియంలో పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మథ్య పోరు జరిగింది. ఈ పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు విజయం సాధించింది. 21-34 తేడాతో జైపూర్ జట్టు విజయం సాధించింది.

మరో మ్యాచ్ లో భాగంగా బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ కూడా పాట్నాలోనే జరిగింది. 42-43 తేడాతో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది.

ఇక.. ఇవాళ్టి మ్యాచుల విషయానికి వస్తే… 25వ మ్యాచ్ హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ మధ్య పాట్నాలో ఇవాళ రాత్రి 7.30కు ప్రారంభం కానుంది. 26వ మ్యాచ్ రాత్రి 8.30 కు పాట్నా పైరేట్స్, పునేరి పల్తాన్ మధ్య అదే పాట్నా స్టేడియంలో పోరు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news