BBC సోదాలపై బ్రిటన్ మంత్రి ప్రశ్న.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జైశంకర్

-

దిల్లీ వచ్చిన బ్రిటన్ మంత్రికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఝలక్ ఇచ్చారు. బీబీసీపై ఐటీ సోదాలపై బ్రిటన్ మంత్రి జేమ్స్ క్లీవర్లీ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్​లో పనిచేసే సంస్థలన్నీ సంబంధిత చట్టాలను పూర్తి స్థాయిలో పాటించాలన్నారు జైశంకర్ స్పష్టం చేశారు.  దిల్లీలో ఇవాళ ఇద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. జీ20 సదస్సులో భాగంగా జరిగే విదేశాంగ మంత్రులు సమావేశం కోసం జేమ్స్ క్లీవర్లీ భారత్​కు వచ్చారు.

బ్రిటన్​​ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీతో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు​. భారత్-బ్రిటన్​ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీరిద్దరూ చర్చలు జరిపారు. ఇదే సమావేశంలో బ్రిటన్​ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ.. బీబీసీపై జరిగిన ఆదాయ పన్ను దాడుల గురించి ప్రస్తావించారు. దీనికి బదులిచ్చిన జై శంకర్​.. భారత్​లో పనిచేసే సంస్థలన్నీ అందుకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు పాటించాలన్నారు. సమావేశం అనంతరం జైశంకర్​ ఓ ట్వీట్​ చేశారు. “ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్షించుకున్నాం. ప్రపంచ పరిస్థితులు, జీ20 అజెండాపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news