BREAKING : నేడు మచిలీపట్నంలో జనసేన వార్షిక ఆవిర్భావ సభ

-

నేడు మచిలీపట్నంలో జనసేన వార్షిక ఆవిర్భావ సభ జరుగనుంది. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం నిర్వహించనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి వారాహి వాహనంలో బయల్దేరనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

ఇక జనసేన వార్షిక ఆవిర్భావ సభ సందర్భంగా.. ఏపీ ప్రజలను ఉద్దేశించి… కీలక ప్రసంగం చేయనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ మేరకు అధికారులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పవన్ కల్యాణ్ సుమారు గంట పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలపై పవన్ కల్యాణ్ గవర్నర్ తో చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news