జనసేన వీర మహిళలను అవమానించిన వారిని వదిలేది లేదు :మంత్రి నాదేండ్ల మనోహర్

-

జనసేన సభ్యత్వ నమోదులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అని తెలిపారు.విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచి విజయం సాధించాలి.. అన్ని డివిజన్స్ ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లాలి.. నామినేటెడ్ పోస్టుల గురించి హడావిడి పెరిగింది.. కష్టపడి పని చేసిన వారి సమాచారం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది అని అన్నారు.

అంకితభావంతో పని చేసిన వారు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. నిజాయతీగా పని చేసిన వారికి గుర్తింపు ఉంటుంది.. తక్కువ సీట్లు అంటు అనేకమంది మాట్లాడారు అని..ఈరోజు ఇండియాలోనే నెంబర్ వన్ గా ఉన్నాం.. మండలిలో కూడా మనం ఉన్నామని మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక, జనసేన పార్టీ అంచలంచెలుగా ముందుకు వెళ్తుంది అని తెలిపారు. విజయవాడలో మనకు జరిగిన నష్టాన్ని అధిగమిద్దాం.. పార్టీ బలోపేతం, కూటమి విజయం కోసం అందరూ నిలబడాలి.. గ్రూపు రాజకీయాలు వద్దు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. గతంలో జన సైనికులపై దాడి చేసిన వారిని వీర మహిళలను అవమానించిన వారిని వదిలేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు .విజయవాడలో జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అని మంత్రి నాదేండ్ల పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news