Janasena : ఉత్తరాంధ్ర నుంచి జనసేన ఎన్నికల శంఖారావం

-

మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి .ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు కసరత్తులు ప్రారంభించాయి. జనసేన పార్టీ కూడా ఎన్నికల శంఖారావం పూరించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . ఫిబ్రవరి 4న అనకాపల్లిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తర్వాత అమలాపురం, మచిలీపట్నం, తెనాలిలో జరిగే బహిరంగ సభల షెడ్యూల్ ను నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేయనున్నారు. సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో జనసేన పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సభలోనే మాజీమంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news