మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలుగు ప్లేయర్ భరత్

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.గతంలో పద్మ భూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నాడు.ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు.

దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి అన్ని రంగాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇండియన్ యంగ్ క్రికెటర్ కేఎస్ భరత్ చిరంజీవిని కలిసి తన టెస్ట్ జెర్సీని అందించి విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు . ఇటీవలే విడుదలైనటువంటి ఈ చిత్రం టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news