ఇవాళ రెండో‌విడత జనసేన జనవాణి భరోసా

-

జనవాణి-జనసేన భరోసా రెండో ద‌ఫా కార్యక్రమానికి జనసేన అధినేత ప‌వ‌న్ సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన మొదటి విడత జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో.. రెండో విడత కార్యక్రమాన్ని విజ‌య‌వాడలో పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. నేడు విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌సవ పున్నయ్య ఇండోర్ హాల్ లో నిర్వహించనున్న జనసేన-జనవాణి కార్యక్రమంలో ప‌వ‌న్ కల్యాణ్‌ పాల్గొంటారు. ఆదివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జ‌న‌సేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి ప్రజ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించిందని, 427 అర్జీలు ప‌వ‌న్ స్వీక‌రించిన‌ట్లు నాదెండ్ల పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, ఒంగోలు నుంచి ప్రజ‌లు ఈ కార్యక్రమానికి త‌ర‌లివస్తార‌ని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. గత ఆదివారం ప్రజలు అందించిన 427 అర్జీలను.. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేలా టీంను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version