ఈవీఎంను పగులగొట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో

-

తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలోని ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉద్రికత్త నెలకొన్నది. గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టాడు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బూత్ లో తనకు సంబంధించిన నేమ్ కార్డు పెట్టలేదని.. కోపంతో ఆయన ఈవీఎంను పగులగొట్టారు.



ఈవీఎంలపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల పేర్లు, ఫోటోలు సరిగ్గా ప్రింట్ చేయలేదని ఆయన సీరియస్ అయ్యారు. ఎన్నికల అధికారులతోనూ ఆయన వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news