జాన్వి చెప్పింది విని సిగ్గు పడ్డ టాలెంటెడ్ యాక్టర్..!!

-

సీనియర్ హీరోయిన్ శ్రీదేవి తెలుగు లో తో పాటు బాలీవుడ్ లో కూడా తన దైన ముద్ర వేసింది. ఆమె అందానికి ఫిదా కాని అభిమానులు ఎవరూ లేరు. అయితే  దురదృష్ట వశాత్తూ ఆమె మనల్ని విడిచి వెళ్ళిపోయింది. ఇక ఆమె అబిమానులు ఆమె కూతురైన జాన్వీ కపూర్ లో ఆమెను చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే ఆమె ఎప్పటినుండో తెలుగు పరిశ్రమ లోకి అడుగు పెడుతుంది అని ప్రచారం జరుగుతోంది.

ఇక ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫోటోస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక ఆమె సౌత్‌ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని దక్షిణాది సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌ సేతుపతితో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట బయటపెట్టింది. తాజాగా మరో తమాషా సంఘటన గురించి బయట పెట్టింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్‌ సేతుపతి గారు అంటే నాకు చాలా చాలా  ఇష్టం. ఆయన నటనకు నేను వీరాభిమానిని.ఆయన నటించిన నానుమ్‌ రౌడీ వందసార్లు చూశాను. తర్వాత ఓసారి ఆయనకు ఫోన్‌ చేసి సార్‌, మీకు పెద్ద ఫ్యాన్ ను, మీతో కలిసి నటించాలని ఉంది. ఛాన్స్‌ ఇస్తే చెన్నై వస్తాను అని చెప్పాను. ఆయన మాత్రం  విచిత్రమైన గొంతు తో సరదాగా నవ్వారే తప్ప సమాధానమివ్వలేదు. ఆయన సిగ్గుపడుతున్నారో, లేక ఏమి చెప్పాలో అర్థం కాక అలా ఉన్నారో అర్థం కాలేదు. కాకపోతే ఆయన ఆశ్చర్యపోయారని మాత్రం అర్థమైంది’ , కాని ఎప్పటికైనా నాకు ఇష్టమైన జూ ఎన్టీఆర్ మరియు ‘విజయ్‌ సేతుపతి గారి తో ఖచ్చితంగా నటిస్తా అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news