ఇండియాతో జపాన్కు ఉన్న మైత్రి సందర్భంగా ఆ దేశం భారత్కు రెండు రైళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇండియా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా జపాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గంటకు ఏకంగా 30 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్ సెన్ E5, E3 సిరీస్ బుల్లెట్ రైళ్లను ఇవ్వనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ను పరీక్షించేందుకు ఈ రైళ్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్లు 2026లో అందుబాటులోకి వస్తాయి. కాగా, ప్రస్తుతం భారత్లో నిర్మిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ 2027లో అందుబాటులోకి వస్తుందని అంచనా.