యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోన్న “జవాన్” ట్రైలర్ !

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఏంటో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం జవాన్. ఈ సినిమాను తెలుగు , తమిళ్ మరియు హిందీ భాషలలో సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఇటీవల జవాన్ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది .. ముఖ్యంగా యాక్షన్ సిక్వెన్సెస్ మరియు మాస్ డైలాగ్స్ విపరీతంగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక గడిచిన 24 గంటల్లో ఈ ట్రైలర్ ను యు ట్యూబ్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ లో 10.2 కోట్ల మంది వీక్షించారు. ఈ విషయాన్నీ అధికారికంగా జవాన్ మూవీ మేకర్స్ తెలియచేశారు. ఇది యు ట్యూబ్ లో సంచలనాన్ని సృష్టిస్తూ నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతోంది.

మరి మరో వారం రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ అవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news