బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ !

-

సాధారణంగా సినీ నటీనటులు రాజకీయాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాము. కొందరు సక్సెస్ అవుతారు కొందరు ఫెయిల్యూర్ అవుతుంటారు, కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సినీ నటి మరియు మాజీ ఎమ్మెల్యే జయసుధ కు సంబంధించిన ఒక రాజకీయ సమాచారం వైరల్ గా మారింది. త్వరలోనే ఈమె బీజేపీ లో చేరనున్నట్లు అధికారిక సమాచారం.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షములో బీజేపీ కండువాను కప్పుకుంటారు. ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలవడం జరిగింది. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ముషీరాబాద్ నుండి పోటీ చేస్తుందని తెలుస్తోంది. ఈమె 2009 లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచింది. అప్పటి నుండి 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. ఆ తర్వాత 2016 నుండి 2019 వరకు టీడీపీలో ఉన్నారు. ఈమె 2019 నుండి 2022 వరకు వైసీపీలో ఉండగా, ఆ తర్వాత నుండి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

మరి ఈ సారి అయినా జయసుధ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి ఒక పార్టీకి మాత్రమే అంకితం అవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news