జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉంది – అచ్చెన్నాయుడు

-

ఆగస్టు 1 నుండి పది రోజులపాటు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేపడతారని తెలిపారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. కొన్ని ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసిన విధానాన్ని ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని తెలిపారు. జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు దోపిడినే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ బ్రష్టు పట్టించారని విమర్శించారు.

 

తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ కి టిడిపి కంటే తాము తక్కువే ఖర్చు పెట్టామని అంబటి స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని.. ఇంకా ఏం ఖర్చు పెడుతుందని అన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు అచ్చెన్నాయుడు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు టిడిపి హయాంలోనే ఎక్కువ ఖర్చు పెట్టామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news