వైఎస్‌ని తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా? : జేసీ

-

బండ బూతులు తిట్టే మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని ప్రశ్నించారు.
అనంతపురం : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి అంటే నాకు అమితమైన అభిమానమని చెప్పిన జేసీ… వైఎస్సార్ చనిపోతే తాను ఏడ్చానని.. ఆయన నాకు మంచి ఆప్తుడని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి పలకరింపులోనే ఆప్యాయత ఉందని.. అలాంటి వ్యక్తి ని రాక్షషుడు అని సంబోధిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. వైఎస్‌ ను బండ బూతులు తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా ? అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.

10 ఏళ్ళు అయింది వైఎస్‌ చనిపోయి.. దయచేసి ఆయనను తిట్టకండని విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రుల నోళ్లు ఏమయ్యాయి… టీడీపీ ని తిట్టదానికేనా మీరు ఉన్నది అంటూ ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌లో సెటిలర్స్‌ ఎవరు అని నిలదీసిన ఆయన.. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లి షాపింగ్స్‌ చేస్తున్నారని తెలిపారు. హిందూ దేశం లో హిందువులు హోమం చేస్తే తప్పా… వర్షాల కోసం యజ్ఞం చేస్తే తప్పా… చేయకూడదని అడ్డుకుంటున్నారని ఏపీ పోలీసులపై ఫైర్‌ అయ్యారు. మసీదులు, చర్చిలు మూసివేయించే దమ్ము పోలీసులకు ఉందా ? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news