అసెంబ్లీ స్థానాల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మీనారాయణ

-

ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు.. రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు. ఈరోజు శ్రీశైలం(మం) సున్నిపెంటలో జేడీ లక్ష్మీనారాయణ సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం లేని రాష్ట్రాన్ని సాధించుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది అని అసహనం వ్యక్తం చేశారు . ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news