రేపు విశాఖలో పర్యటించనున్న జనసేనాని

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే ఉండి ,ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. వచ్చే ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా..యలమంచిలి,గాజువాక,భీమిలీ, చొడవరం, పెందుర్తి  స్థానాలపై జనసేన కన్ను పడింది.

ఇదిలా ఉంటే….ఇన్శాట్ 3 డీఎస్ ప్రయోగం విజయవంతం కావడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో విజయాలు సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇండియాకి గర్వకారణమని అన్నారు. ఇస్రో మరెన్నో విజయాలు సాధించాలని, అంతరిక్ష యవనికపై భారత జైత్ర యాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news