బ్రేకింగ్ : జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల…

-

జేఈఈ (మెయిన్) పేపర్-2 ఫలితాలు విడుదల విడుదలయ్యాయి. కాసేపటి క్రితమే జేఈఈ (మెయిన్) పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పేపర్ 2-ఏ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించింది కాగా,పేపర్-2 బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించింది. ఈ పరీక్ష ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 23 వ తేదీ, సెప్టెంబర్ 2 వ తేదీల్లో నిర్వహించింది.

రెండు సెషన్స్ కి కలిపి మొత్తం 96,236 మంది రిజిస్టర్ చేసుకోగా 65,015 మంది పరీక్ష రాసారు. పేపర్ 2(బీ) లో మహారాష్ట్ర కి చెందిన జాధవ్ ఆదిత్య సునీల్,కర్ణాటక కి చెందిన ఈశ్వర్ బాలప్ప 100 శాతం స్కోర్ సాధించారు. పేపర్ 2 (బి) లో ఆంధ్రప్రదేశ్ లో బండారు రమా సాహిత్య మొదటి ర్యాంక్ సాధించగా తెలంగాణా లో శ్రీ తేజా రెడ్డి పష్య మొదటి ర్యాంక్ సాధించారు. ఇక పేపర్ 2(ఏ) లో తెలుగు రాష్ట్రాల టాపర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉప్పల వివేక్ నారాయణ్ మొదటి ర్యాంక్ సాధించగా.. తెలంగాణ లో జోస్యుల వెంకట ఆదిత్య టాప్ ర్యాంక్ సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news