జియో బంఫ‌ర్ ఆఫర్‌.. ఆ ప్యాక్‌ల‌పై డ‌బుల్ డేటా..!

-

టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌కటించింది. త‌న డేటా యాడాన్ ప్యాక్‌ల‌పై డ‌బుల్ డేటాను అందిస్తోంది. అలాగే ఆయా ప్యాక్‌ల‌పై ఉచిత ఆఫ్‌నెట్ నిమిషాల‌ను కూడా అందిస్తోంది. జియోకు చెందిన రూ.11, రూ.21, రూ.51, రూ.101 ప్యాక్‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అందిస్తూ వ‌చ్చిన డేటాకు అద‌నంగా రెండు రెట్ల డేటాను జియో అందిస్తోంది. అలాగే ఉచిత ఆఫ్‌నెట్ నిమిషాల‌ను కూడా వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.

jio gives double data and free off net minutes on these add on packs

రూ.11 ప్లాన్‌లో గ‌తంలో 400 ఎంబీ డేటా ఇచ్చేవారు. ఇప్పుడు 800 ఎంబీ డేటా పొంద‌వ‌చ్చు. అలాగే రూ.21 ప్లాన్‌లో గ‌తంలో 1జీబీ డేటా ఇవ్వ‌గా ఇప్పుడు 2జీబీ డేటాను అందిస్తున్నారు. ఇక రూ.51 ప్లాన్‌లో గ‌తంలో 3జీబీ డేటా వ‌చ్చేది. ఇప్పుడు 6జీబీ డేటాను పొంద‌వ‌చ్చు. ఇక రూ.101 ప్లాన్‌లో గ‌తంలో 6జీబీ డేటా ల‌భించేంది. ఇప్పుడు 12 జీబీ డేటా పొంద‌వ‌చ్చు. అలాగే ఆయా ప్లాన్ల‌కు వ‌రుస‌గా 75, 200, 500, 1000 ఉచిత జియో టు నాన్ జియో నిమిషాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇక ఈ యాడాన్ ప్యాక్‌ల‌కు ప్ర‌త్యేకంగా ఎలాంటి వాలిడిటీ లేదు. వినియోగ‌దారులకు ప్ర‌స్తుతం ఉన్న ప్లాన్ వాలిడిటీనే ఈ ప్యాక్‌ల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఉన్న ప్లాన్‌లో డేటా అయిపోతేనే ఈ యాడాన్ ప్యాక్‌ల‌లో డేటాను, నిమిషాల‌ను వారు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ప్యాక్‌ల‌ను వినియోగ‌దారులు ఎన్నింటినైనా ఒకేసారి రీచార్జి చేసుకోవ‌చ్చు. కానీ ఒక ప్యాక్ బెనిఫిట్స్ అయిపోయాకే మ‌రొక ప్యాక్ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. జియో వెబ్‌సైట్ లేదా యాప్‌ల‌లో ఈ ప్యాక్‌ల‌ను వినియోగ‌దారులు రీచార్జి చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news