గుడ్ న్యూస్: రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు… వివరాలు ఇవే..!

-

ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా…? నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. దీనితో మీరు సులువుగా ఉద్యోగం పొందొచ్చు. వివరాల లోకి వెళితే… 2,532 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇండియన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్‌ రైల్వే లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఎలాంటి రుసుము దరఖాస్తు కోసం చెల్లించక్కర్లేదు.

మార్చి 5వ తేదీ లోగా అప్లై చేసుకోండి. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. ఎంపికైన అభ్యర్థులు నాగ్‌పూర్‌, భుసావల్‌, షోలాపూర్‌, ముంబై, పుణె డివిజన్ లలో పని చేయాల్సి ఉంటుంది. ఇక అర్హత విషయం లోకి వస్తే… పదో తరగతి చదివి ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మినిమమ్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

https://www.rrccr.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం దీని కోసం తప్పకుండ ఎన్‌టీవీసీ సర్టిఫికెట్ ఉండాలి. మొత్తం 2532 ఖాళీలలో క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ డిపో, వ్యాగన్‌ వాడి బందర్ లో ఖాళీలు 469, మాతుంగా వర్క్‌ షాప్‌ లో 547 కుర్లా డీజిల్‌ షెడ్‌ లో 60 ఖాళీలు ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news