మంచి భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: పీజేఆర్ కూతురు

-

దివంగత నేత పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరనున్నట్లు విజయా రెడ్డి వెల్లడించారు. గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పీజేఆర్ కూతురు విజయా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈనెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. మంచి భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఇంటి పార్టీలోకి వస్తున్న భావన ఉందన్నారు. టిఆర్ఎస్ పార్టీ అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించినా.. సరైన గుర్తింపు దక్కలేదని.. అందుకే పార్టీ మారుతుందని స్పష్టం చేశారు. అయితే నా శక్తి సామర్థ్యాన్ని చాటాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైనదని భావించాను. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ రాలేదని.. అయినా ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడే మాట్లాడాను అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news