బీజేపీ సెక్రటరీలో సమావేశం కానున్న జేపీ నడ్డా.. ఎందుకంటే?

-

హరియాణా, జమ్మూకాశ్మీర్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ జనరల్ సెక్రటరీలతో కాసేపట్లో సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఈసీ ప్రకారం ప్రస్తుతం హరియాణాలో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోవడమే కాకుండా మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ ప్రస్తుతం 49 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.

ఒకవేళ ఫలితాలు తారుమారు అయితే ఏం చేయాలన్న దానిపై జనరల్ సెక్రటరీలతో జేపీ నడ్డా చర్చిస్తారని సమాచారం. ఇక జమ్మూకాశ్మీర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా 90 స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్, ఎన్సీ కూటమి దాటేసింది. ఈ కూటమి 45కు పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా.. బీజేపీ కేవలం 27 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version