Breaking : మునుగోడు బీజేపీ భారీ బహిరంగ సభకు జేపీ నడ్డా

-

రోజు రోజుకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. అయితే.. ఓటర్లను తమ వైపుకు మళ్లించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఈ నెల 31న మునుగోడులో బీజేపీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారంటూ ఆ పార్టీ తెలంగాణ శాఖ మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది.

JP Nadda - Nagaland: Bharatiya Janata Party president J P Nadda visits  Church; takes part in auto-rickshaw rally - Telegraph India

ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, లేదంటే జేపీ నడ్డా గానీ హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు ఇదివరకే వెల్లడించారు. మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టింది. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని నేపథ్యంలో జేపీ నడ్డా ఈ సభకు రానున్నారు. జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారు కావడంతో మంగళవారం బీజేపీ తెలంగాణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news