టీడీపీని కంగారు పెట్టిన ఎన్టీఆర్ ఫ్లెక్సీ…!

-

తెలుగుదేశం పార్టీ బ్రతకాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ముందుకి రావాలి అనేది ఆ పార్టీలోనే కొందరి కోరిక. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ ఆ పార్టీ బ్రతుకుతుంది అని ప్రస్తుతం కష్టాల్లో ఉన్న పార్టీ కోసం తారక్ కచ్చితంగా ముందుకి రావాలి అని ఆ పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ఈ సమయంలోనే నారా లోకేష్ సామర్ధ్యం కూడా చర్చకు వస్తుంది. రాజకీయంగా లోకేష్ ముందుకి వెళ్ళడం కష్టమని అంటూ,

పార్టీ బ్రతకాలి అంటే తారక్ ముందుకి రావాలని లోకేష్ వలన కాదని అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ తెలుగుదేశం కార్యకర్తలను కంగారు పెట్టింది. 2024 ఏపీ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ కాలానికి కాబోయే సీఎం అని పేర్కొనడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఫ్లెక్సీని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావు అనుచరులు ఏర్పాటు చేసారు.

ఈమె 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంత వరకు బాగానే ఉంది గాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటో మాత్రం అందులో లేదు. మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, దివంగత ఎన్టీఆర్ ఫోటో ఉన్నాయి. దీనితో కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. కొందరు కావాలనే హడావుడి చేస్తూ ఉంటారని ఆమెకు టికెట్ రెండు సార్లు ఇచ్చింది చంద్రబాబు అనే విషయాన్ని గ్రహిస్తే మంచిది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news