ఏమిచ్చినా మీరుణం తీర్చుకోలేను.. అభిమానుల‌కు తార‌క్ లేఖ‌

-

యంగ్ టైగ‌ర్ ఎన్జీఆర్ త‌న అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త తెలుపుతూ లేఖ రాశారు. తార‌క్ కొద్ది కాలం క్రితం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఐసోలేష‌న్‌లోనే ఉంటున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త్వ‌ర‌గా కోలుకోవాలంటూ పోస్టులు వీడియోలు పంపిస్తున్నారు తార‌క్‌కు.

అయితే రేపు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తార‌క్ అభిమానుల‌కు ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. నాకు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మీరు పంపిస్తున్న పోస్టులు, వీడియోలు చూస్తున్నాను. అవి నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి.

ప్ర‌తి సంవ‌త్సరం నా పుట్టిన రోజునాడు మీరు పంపిస్తున్న విషెస్‌, చేస్తున్న సేవ‌ల‌ను ఆశిస్సులుగా భావిస్తున్నా. కానీ ఈ సంవ‌త్స‌రం మాత్రం అంద‌రూ లాక్‌డౌన్ పాటిస్తూ ఇంట్లోనో ఉండండి. ఇది సంబురాలు చేసుకునే స‌మ‌యం కాదు. త్వ‌రలోనే మ‌న దేశం క‌రోనాను జ‌యిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అప్పుడు అంద‌రం క‌లిసి వేడుక‌లు చేసుకుందాం.. అంటూ ఆ లేఖ‌లో తార‌క్ రాసుకొచ్చాడు. ఈ లేఖ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాల వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news