బ్రేకింగ్: బ్లాక్ ఫంగస్ కి తెలంగాణాలో ఆయుర్వేద వైద్యం

-

తెలంగాణాలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కి ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్యం అందించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అల్లోపతీ తో పాటు ఇతర వైద్య విధానాలను సైతం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి… రామంతపుర్ లోని హోమియోపతి ఆసుపత్రిలో ఈ సేవలను అందిస్తారు. చార్మినార్ వద్ద ఉన్న యునాని ఆసుపత్రులలో బ్లాక్ ఫంగస్ కి ట్రీట్మెంట్ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆయుష్ ఆసుపత్రి లలో అందుబాటు లో ఉన్న వైద్యాన్ని కర పత్రాల ద్వారా,ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సి ఎస్ ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news