బ్రేకింగ్ : ఆగస్ట్ 15 తరువాత కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్

-

బ్రేకింగ్ : ఆగస్ట్ 15 తరువాత కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్ వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ప్రకటన చేశారు. కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్ వచ్చేసిందని వెల్లడించారు. నేను చెప్పకనే చెప్తున్నా…..ఆఫీషియల్ గా చెప్పకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఆగస్ట్ 15 తరువాత ఏమి జరగబోతుందో మీరే చూస్తారని స్పష్టం చేశారు ఆదిమూలపు సురేష్.

కర్నూలుకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని వెల్లడించారు. ఏపీ లో టౌన్ ప్లానింగ్ లో అవినీతి ఉంది…విజిలెన్స్, ఏసీబీ కేసుల ఫైల్స్ చూస్తే 150 ఇవే పెండింగ్ ఉన్నాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. టౌన్ ప్లానింగ్ తీరు మారాలి…సిటీ ప్లానర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కిందిస్థాయి సిబ్బందిపై నెపం వేస్తే కుదరదని.. 16 వేల అక్రమ లేఔట్లు ఉన్నాయని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news