ఏపీలో 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ

-

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం 68 జూనియర్ సివిల్ జడ్జి భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55 బదిలీల ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వారం రోజులుగా 25 మంది సీనియర్ సివిల్ జడ్జిలను హైకోర్టు బదిలీ చేసింది. ఆగస్టు 2లోపు వారు ప్రస్తుతం పని చేస్తున్న స్థానాలను వదిలి కొత్తగా పోస్టింగ్ వచ్చిన చోట బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు ఈ వివరాలు ఏపీ హైకోర్టు వెబ్ సైట్‌లో పొందుపర్చింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడేళ్లలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆన్ లైన్ ద్వారా పద్ధతి ప్రకారమే బదిలీలు జరగాయని న్యాయనిపుణులు అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news