జూనియర్ ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేసినా రావడం కుదరదన్నారు: టీడీపీ నేత జనార్దన్

-

స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తన మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాగా తాజాగా ఈ అంశంపై ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు టీడీపీ నేత టీడీ జనార్దన్ అసలు విషయాన్ని బయటపెట్టారు. జనార్దన్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల కోసం ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి వెళ్ళాము, కానీ అప్పట్లో బిజీ గా ఉన్నాను వారం తర్వాత రమ్మని చెప్పారని చెప్పారు. వారం తర్వాత వెళ్లి ఈ ఉత్సవాలకు ఎలాగైనా హాజరు కావాలని రిక్వెస్ట్ చేశామని చెప్పారు జనార్దన్.

కానీ ఎన్టీఆర్ నేను ఇప్పటికే పుట్టినరోజు ఫంక్షన్ ప్లాన్ చేసుకున్నాను.. రావడం లేదు అని చెప్పారట. కానీ మేము పుట్టినరోజులు ఎన్ని సార్లైనా వస్తాయి.. ఉత్సవాలకు ఎలాగైనా రండి అన్నా వినలేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news