జూరాల ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటి విడుదల

-

ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి వస్తోన్న వరదతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం జూరాలలోకి చేరుతోంది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుకు నుంచి 1.56 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.826 మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది. జూరాల పూర్తి నీటినిల్వ 9.65 టీఎంసీలుకాగా ఇప్పుడు 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news