నాకు ఓటేయొద్దా.. ఫామ్‌హౌస్‌లో తాగి పండే నీకు ఓటెయ్యాలా..? : కేఏ పాల్

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారానికి మరో రెండ్రోజుల్లో గడువు ముగియనున్నందున ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలతో పోటాపోటీగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కూడా ప్రచారం చేస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలం తస్కాని గూడెం, బంగారిగడ్డ గ్రామాల్లో కేఏ పాల్ ప్రచారం నిర్వహించారు. తస్కానిగూడెం గ్రామంలో చిన్న పిల్లలతో కలిసి డాన్స్ చేశారు. బంగారిగడ్డ గ్రామంలో గ్రామస్థులతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ స్పందించారు. నిన్న బహిరంగ సభలో.. డ్యాన్సులు వేసే వారికి ఓట్లు వేయొద్దన్నావ్.. మరి నువ్వు తాగి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నావ్‌ నీకెందుకు ఓటెయ్యాలి. అని కేసీఆర్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news