కొరియర్ లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన ఏపీ యువకులు..అడ్రస్ సరిగా లేక !

-

కొరియర్ లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. కాకినాడ డీ టీ డీ సీ కొరియర్ లో డ్రగ్స్ ఆర్డర్ చేశారు కొంత మంది యువకులు. దీంతో సర్పవరం పరిధిలో 8 మంది, టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు యువకులను విచారిస్తున్నారు కాకినాడ పోలీసులు. కొరియర్ చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు డీటీడీసీ కొరియర్ సంస్థ నిర్వహకులు.

దీంతో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ ఆర్డర్ చేసిన వారి లో ఎక్కువ మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొరియర్ సంస్థ ప్రతినిధుల నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు… ప్రమ్ అడ్రస్ సరిగా లేకపోవడంతో ఎక్కడ నుంచి వచ్చాయని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అడ్రస్ నుంచి ఎప్పుడు అయినా కొరియర్లు వచ్చాయా అని డేటా సేకరణ చేస్తున్నారు పోలీసులు. మరింత మంది డ్రగ్స్ ఆర్డర్లు ఇస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news