ఈటలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

-

వరంగల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీవారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలపై టీఆర్‌ఎస్ నేతలు మాటల దాడిని పెంచారు. మంగళవారం వరంగల్ నగరంలో మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. ఈటల రాజేందర్‌పై మండిపడ్డారు. రైతు బంధు పథకం కింద ఈటల రాజేందర్ రూ. 26 లక్షలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. లబ్ధిపొంది రైతు బంధు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారని కడియం ప్రశ్నించారు. 5 ఏళ్ల క్రితమే సీఎంతో మనస్పర్థలు వస్తే ఇప్పుడు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా అని కడియం వ్యాఖ్యానించారు.

‘‘కేసులకు భయపడే ఈటల బీజేపీ‌లో చేరారు. బీజేపీ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న పార్టీ. కేసీఆర్‌పై ఈటల వాడిన భాష సరిగా లేదు. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న రాజేందర్ ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఏంటి?. ఈటలలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయాడా?. ఏమి ఉద్ధరించడానికి బీజేపీ‌లో చేరారు. పేద ప్రజల ఆహారపు అలవాట్లపై కూడా బీజేపీ దాడి చేసింది. అది తెలిసి కూడా బీజేపీ‌లో ఎలా చేరారు. తెలంగాణకు బీజేపీ  ఏమీ ఇచ్చింది?. పార్టీ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడమేంటి?. అధికారం‌తో సంబంధం లేకుండా దాదాపు 33 సంవత్సరాలుగా ఈటల రాజకీయాల్లో ఉన్నారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీలో చేరారు.’’ అని కడియం శ్రీహరి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news