చంద్రబాబు అరెస్ట్: దీక్ష చేస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు మృతి !

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ లో సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఇక తాజాగా కాకినాడలో నిరసన దీక్షలు చేస్తున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి అక్కడికక్కడే మరణించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది, ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుండి కాకినాడలో నిరసన తెలియచేస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ టీడీపీ అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఆయన గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో, ఆందోళన చెందిన కార్యకర్తలు ఆమెను కాకినాడ GGH కు తీసుకువెళ్లగా ముందుగానే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దానితో చంద్రబాబు కోసం మరో ప్రాణం మూగబోయింది. అయితే ఈమె కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news