సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ..

-

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు.ఈ సందర్భంగా ఈడీ విచారణ, కేజ్రీవాల్ జైలు కెళ్లిన పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.

ఇటీవలే జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే .తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సునీతా కేజ్రీవాల్- కల్పనా సోరెన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈడీ అధికారులు జరిగిస్తున్న తీరుపై కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కల్పనా సోరన్ మీడియాకు వెల్లడించారు .అలాగే సోనియా గాంధీని కూడా కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఇదిలా ఉంటే…. కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదివారం ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రము చేపట్టనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news