కంగన రనౌత్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరణ

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనోత్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. 2021 మే 4వ తేదీన కంగనా రనోత్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా క్లోజ్ అయింది. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు ఉన్న కంగనా ఖాతాలో నిలిపి వేస్తున్నట్లు గతంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ వెల్లడించింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విట్టర్ నియమ నిబంధనలను కంగనా బ్రేక్ చేస్తున్నారంటూ పేర్కొంది.

విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. దీంతో ఆమె ట్విటర్ ఖాతాని నిలిపివేశారు. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతాని మళ్లీ పునరుద్ధరించడంతో.. “అందరికీ నమస్కారం.. ట్విట్టర్ కు తిరిగి రావడం ఆనందంగా ఉంది” అంటూ ట్వీట్ చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి రావడంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news