అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగనా

-

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ మరోసారి సంచలనం సృష్టించారు. సుశాంత్‌ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీలో ఉండగా ఫోన్‌ చేశారనీ, అయితే తన స్టేట్‌మెంట్‌ను తీసుకోవడానికి ఎవరూ రాలేదని వివరించారు. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడానని, తాను పారిపోయే మనిషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, తన పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు.

మరోవైపు సుశాంత్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అతని ప్రియురాలితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా విచారించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ సమర్పించి కేసు క్లోజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సుశాంత్ మరణించి నెలరోజులు గడిచినా కూడా అతని మరణం విషయంలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news