కంగనా రనౌత్: కరణ్ జోహార్ ఇక రిటైర్ అవ్వడం మంచిది … డబ్బంతా వృధా చేస్తున్నాడు !

-

బాలీవుడ్ లో వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని కామెంట్ చేయడం, తద్వారా వివాదంలో చిక్కుకోవడం జరుగుతూ ఉంది. ఇక కంగనా తాజాగా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈమె కరణ్ జోహార్ ని ఏమంది అంటే… ఈమె ఇన్స్టా వేదికగా “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్” గురించి మాట్లాడుతూ… ఈ సినిమాను 1990 సమయంలో వచ్చిన చిత్రాలను కాఫీ కొట్టి రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఇలాంటి సినిమా తీసినందుకు సిగ్గుపడాలి అంటూ కామెంట్ చేసింది. ఇకనైనా డబ్బును వృధా చేయడం ఆపేసి వెంటనే సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పు కొత్తవారికి అవకాశం ఇవ్వాలి అంటూ చురకలు అంటించింది.

కాగా ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ మరియు అలియా భట్ లు నటించారు. నిన్న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news