సోము వీర్రాజు కారణంగానే బీజేపీకి రాజీనామా – కన్నా లక్ష్మీనారాయణ

-

సోము వీర్రాజు కారణంగానే బీజేపీకి రాజీనామా చేశానని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఏపీ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా బిజెపి పార్టీని వీడారు.

కాగా గత కొంత కాలంగా బిజెపి పార్టీలో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. అయితే, దీనిపై మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు.. పార్టీని ఓ సంస్థలాగా నడిపిస్తున్నాడని ఆగ్రహించారు. ప్రధాని మోడీ పని తీరును చూసి.. బీజేపీలో చేరానని.. అలాగే, తన పనితీరు చూసి… నాకు అధ్యక్ష పదవీ ఇచ్చారన్నారు. కానీ, సోము వీర్రాజు.. అధ్యక్షుడు అయ్యాక, పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. నిప్పులు చెరిగారు కన్నా లక్ష్మీనారాయణ. కాగా, బీజేపీకి రాజీనామా చేసి.. ఆ లేఖను నడ్డాకు పంపారు కన్నా లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news