బీజేపీ , జనసేన కలిసే పోటీ చేస్తాయి : కన్నా లక్ష్మీనారాయణ

-

కర్నూలు : బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , జనసేన కలిసే పోటీ చేస్తాయని కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటన చేశారు. ఎన్నికల పొత్తులపై జాతీయ స్తాయిలోనే నిర్ణయం జరుగుతుందన్నారు కన్నా లక్ష్మీ నారాయణ. కర్నూలు సమావేశంలో ఎపి లో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై చర్చించామని వెల్లడించారు.

ఇక్కడ పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోరని.. కేంద్రం ఇస్తున్న నిధులతో వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని స్పష్టం చేశారు కన్నా లక్ష్మీ నారాయణ. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రాలకు ఇస్తున్న నిధులపై ప్రజల్లో విస్తుతంగా ప్రచారం చేయాలని నిర్ణయించామని చెప్పారు కన్నా లక్ష్మీ నారాయణ

Read more RELATED
Recommended to you

Exit mobile version