టిడిపి ప్రభుత్వం.. పెగాసెస్ కొనలేదు..ఇదే ఫైనల్ : ఏబీ వెంకటేశ్వరరావు

-

టిడిపి ప్రభుత్వం.. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నంత వరకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనలేదు.. ఇది ఫైనల్ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని.. ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేస్తారా..? అని సర్కార్ పై ఫైర్ అయ్యారు. జీవితాంతం దుష్టుల నుంచి ప్రజలను రక్షిస్తే.. ఇప్పుడు నాకే రక్షణ లేకుండా పోయిందని.. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.. కానీ ఉద్యోగం చేసే వారికీ కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పారు.

ప్రభుత్వాన్ని నేను విమర్శించకూడదని.. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.. ప్రైవేట్ వ్యక్తులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి నేను మాట్లాడుతున్నానని తెలిపారు. నేనేం నాగాలాండ్ నుంచి రాలేదు..పంజాబ్ నుంచి రాలేదు.. ఏపీ మట్టిలో పుట్టాను… తప్పు చేయాలంటే భయపడే వ్యక్తిని నేను అంటూ వెల్లడించారు. ఇలా జరుగుతుందని తెలిస్తే సివిల్ సర్వీసెసులోకి నేను వచ్చే వాడినా..? మరేవరైనా వస్తారా..? అని ఫైర్ అయ్యారు. నన్ను సస్పెండ్ చేసిన నాటి నుంచి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. ఇది ఎంత వరకు సమంజసం ? అనిప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version