ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న చిన్న కోడ‌లు అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందారు. క‌న్నా చిన్న కుమారుడు ఫ‌ణేంద్ర భార్య సుహారిక అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయారు.

kanna laxmi narayana second daughter-in-law mysterious death

హైద‌రాబాద్ న‌గ‌రం రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మీనాక్షి బాంబూస్‌లో‌ గురువారం స్నేహితుడి ఇంట్లో పార్టీ చేసుకుంటుండ‌గా సుహారిక ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. దీంతో ఆమెను వెంట‌నే రాయ‌దుర్గంలోని ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. అనుమానాస్ప‌ద మృతిగా కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే సుహారిక ఎందుకు చనిపోయారో వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

కాగా చిన్న కోడ‌లు మృతి చెంద‌డంతో క‌న్నా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news