అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెడుతున్నారు : కన్నా లక్ష్మీనారాయణ

-

బిజేపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఏపీ సీఎం జ‌గ‌న్ పై ప్ర‌భుత్వ ప‌థ‌కాలపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నియంత , అసమర్దుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలను చూడవచ్చంటూ క‌న్నా వ్యాఖ్యానించారు. జగన్ ఒక్క చాన్స్ తీసుకోని ప్రజలకు బ్రతికే చాన్స్ లేకుండా చేశారంటూ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుతం అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెట్టి దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.

నవరత్నాలు పేరుతో ఓట్లు కొనుకొంటున్నారని…ప్రజలను
నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అప్పుల ఆంద్రప్రదేశ్ గా మార్చారంటూ క‌న్నా ల‌క్ష్మి నారాయ‌ణ మండిప‌డ్డారు. ప్రభుత్వ ఆస్తులను వాళ్ల తాతా ఆస్తుల లాగా తాకట్టు పెడుతున్నారంటూ ఆయ‌న ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news