చిత్ర పరిశ్రమలో మరో విషాదం : ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌ క‌న్నుమూత‌

-

చిత్ర పరిశ్రమ ను వరుస విషాదాలు చుట్టేస్తున్నాయి. ఇప్పటి కే చాలా మంది ప్రముఖ నటీ నటులను చిత్ర పరిశ్రమ లో కోల్పోయింది. 2020 సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమ లో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంది. అయితే… తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు మరియు హాస్యనటుడు శంకర్ రావు సోమవారం… ఆయన స్వగృహంలో మృతి చెందారు.

88 సంవత్సరాలు ఉన్న శంకర్‌ రావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నిద్ర లోనే తుది శ్వాస విడిచారు శంకర్‌ రావు. మూడు దశాబ్దాలకు పైగా ప్రముఖ హీరోలందరి పక్కన వందకు పైగా కన్నడ చిత్రాలలో నటించారు శంకర్ రావు. ‘యారా సాక్షి’ సినిమాతో శాండల్‌వుడ్ అరంగేట్రం చేసిన శంకర్‌ రావు.. బెస్ట్‌ కమెడీయన్‌ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే… మాయ మృగ’, ‘సిల్లీ లల్లీ’ మరియు ‘పాపా పాండు’ వంటి ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్‌లో కూడా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news