తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లు వసూలు చేసిన “కాంతార”

-

డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాను కన్నడలో చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే తెలివిగా ఆలోచించి ,తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసి వెంటనే రిలీజ్ చేశారు.

అయితే.. సర్దార్ చిత్రం మినహా మిగతా చిత్రాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. గతవారం రిలీజ్ అయిన చిత్రాల కంటే మెరుగ్గా కాంతార వసూళ్లను రాబడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు 25 కోట్ల గ్రాస్ ను దాటేసింది. ఈ చిత్రం ఇప్పటివరకు 13.8 కోట్లు వసూలు చేసింది మరియు దీపావళి వీకెండ్ ను మరింతగా క్యాష్ చేసుకోనుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యుఎస్ లో 1 మిలియన్ మార్క్ ను దాటింది. కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో సప్తమి గౌడ కథానాయికగా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news