సుశాంత్ మరణం తర్వాత కరణ్ జోహార్ తొలి ట్వీట్

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తొలి ట్వీట్ చేశారు. జూన్ 14 తర్వాత కరణ్… సుశాంత్ సింగ్ ఇక లేడు అని ట్వీట్ చేసి, ఇప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు. వినాయకుడి నుంచి వచ్చే శక్తి మిమ్మల్ని మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచుతుంది అంటూ, అదేవిధంగా మన ఎల్లవేళల రక్షిస్తుంది అని వినాయకుడి ఫోటో పెడుతూ కామెంట్ చేశాడు.Karan Johar has a new private Instagram account - List of celebs ...

సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం కరణ్ జోహార్ అని ఆరోపణలు బాలీవుడ్ లో చాలామంది చేశారు అప్పటి నుంచి కరణ్ జోహార్ అసలు ఎక్కడా కూడా కనబడలేదు. దీనితో డిప్రెషన్ లో ఉన్నాడని పలువురు మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరణ్ జోహార్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా తెలుగులో ఫైటర్ అనే సినిమాను రూపొందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news